TRINETHRAM NEWS

ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు మూడు రోజుల సెలవు

AN:ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు వరసగా మూడు రోజులు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ దోరేపల్లి శ్వేత గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 26న గణతంత్ర దినోత్సవం, 27 వారాంతపు యార్డ్ బంద్, 28 న వారంతపు సెలవు ఉన్న నేపథ్యంలో వరుసగా 3 రోజులు మార్కెట్ బంద్ ఉంటుందన్నారు. సోమవారం నుండి మార్కెట్లో పంట క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని తెలిపారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు.