TRINETHRAM NEWS

రాజోలి మండల కేంద్రంలో కన్నుల పండుగగా రాములోరి పండగ…

జోగుళాంబ ప్రతినిధి,రాజోలి:-అయోధ్య పుణ్యక్షేత్రంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట ను పురస్కరించుకొని మండల పరిధిలోని గ్రామాలలో శ్రీ రాములవారి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజోలి మండల కేంద్రంలో జైశ్రీరామ్ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ వైకుంఠ నారాయణస్వామి సన్నిధిలో వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తూ శ్రీరామ నామంతో ప్రధాన వీధుల గుండా తిరుగుతూ రామనామ స్మరణ చేస్తూ భానసంచ పేలుస్తూ న్యూ రాజోలిలో వెలసిన రాములవారి సన్నిధికి చేరుకొని కళ్యాణం నిర్వహించారు. అనంతరం ఉప్పరి మల్దకల్లు అన్నదాన కార్యక్రమం నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాను స్వీకరించారు…