TRINETHRAM NEWS

Inauguration of Ramadugu New Bridge

చొప్పదండి :త్రి నేత్రం న్యూస్

చిన్న కారణాలతో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న రామడుగు బ్రిడ్జిని ఈరోజు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పచ్చ జండా ఊపి ఘనంగా ప్రారంభించారు.నేటి నుండి సుమారు 50 గ్రామాల ప్రజలకు బ్రిడ్జి ద్వారా రాకపోకలు ప్రారంభమయ్యాయి…..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకులు కేవలం ఇద్దరు రైతులకు పరిహారం ఇప్పించలేక బ్రిడ్జి ప్రారంభం నోచుకోలేదని ,ఏళ్లతరబడి నాలుగు మండలాల ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడ్డారని ,ఈ సమస్య మీద గతంలో మేమే అనేకసార్లు పోరాటం చేశామని గుర్తుచేశారు.సమయస్ఫూర్తితో రైతులను ఒప్పించి పెండింగ్ పనులు పూర్తి చేశామని ,నన్ను గెలిపించిన ప్రజల సమక్షంలో బ్రిడ్జి ప్రారంభం చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందని,గత పాలకులు మాటలతో కాలం గాడిపరని కానీ మేము పనులు చేసి ప్రజల మన్నన పొందుతామన్నారు.కుండపోత వానను లెక్కచేయకుండా బ్రిడ్జి పనిని త్వరితగతిన పూర్తి చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో 6 మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు ,ప్రజలు ,అధికారులు పాల్గొన్నారు…..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Inauguration of Ramadugu New Bridge