TRINETHRAM NEWS

Trinethram News : తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ ప్రత్యేకంగా తెలుగులో ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.

‘కొత్తదనాన్నీ, పునరుత్తేజాన్నీ తనతో తీసుకొచ్చే ఉగాది.. కొత్త సంవత్సరానికి నాంది పలుకుతుంది.

ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.

ఈ సంవత్సరం అందరి జీవితాల్లో అమితమైన సంతోషాన్నీ, శ్రేయస్సునీ నింపాలని ఆకాంక్షిస్తున్నాను.

ఈ పండుగ మీ అందరి జీవితాల్లో అన్ని అంశాల్లో సంతోషాన్ని తీసుకువస్తుందని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.