Allu Arjun : అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసుల పిటిషన్

TRINETHRAM NEWS

అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసుల పిటిషన్

Trinethram News : హైదరాబాద్:డిసెంబర్ 23
సంధ్య థియేటర్ ఘటనపై కేసులో పోలీసులు దర్యాప్తు ను ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసిన విషయం తెలిసిందే.

అయితే, అల్లు అర్జున్ మీడి యా సమావేశం ఏర్పాటు చేసి సంధ్య థియేటర్ ఘటనలో తన తప్పు ఏమీలేదని చెప్పాడు. దీంతో అర్జున్ మీడియా సమావేశం పెట్టడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. బెయిల్ నిబంధనలు ఉల్లంఘిం చారని పేర్కొంటున్నారు.

ఈ క్రమంలో ఆయన బెయిల్ రద్దుపై పోలీసులు అప్పీల్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. ఇవాళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఘటన జరిగిన రోజు అల్లు అర్జున్ తీరుపైనా పోలీసులు అసంతృప్తితో ఉన్నారు.

రేవతి మృతి తెలిసి కూడా తెలియదని అల్లు అర్జున్ చెప్పడం ఆయన విచక్షణకే వదిలేయాలని ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో నగర సీపీ సీవీ ఆనంద్ అన్నారు. థియేటర్లో ఉన్న అల్లు అర్జున్ కు పోలీసులు విషయం చెప్పారని కానీ, రేవంతి మృతి మరుసటి రోజు తెలిసిందని అల్లు అర్జున్ మాట మార్చా డంటూ సీపీ పేర్కొన్నారు

మీడియా సమావేశంలో సంధ్య థియేటర్ ఘటన సమయంలో వీడియోలను ప్రదర్శిస్తూ సీపీ ప్రజెంటేషన్ ఇచ్చారు. న్యాయపరంగా అల్లు అర్జున్ కేసును ఎదుర్కొంటామని సీపీ ఆనంద్ పేర్కొన్నారు. మరోవైపు అల్లు అర్జున్ నివాసం వద్ద ఓయూ జేఏసీ నేతలు ఆందోళనకు దిగారు.

ఈ క్రమంలో పోలీసులు ఆరుగురు ఓయూ జేఏసీ నేతలను అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అర్జున్ నివాసం వద్ద జరిగిన ఘటనపై డీజీపీకి ఫోన్ చేసి సీఎం రేవంత్ రెడ్డి, ఆరా తీశారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్ ఆదేశించారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top