TRINETHRAM NEWS

ఎలక్షన్ కమిషన్ నేడు పార్లమెంటు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 56 రాజ్యసభ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

ఏప్రిల్ చివరికి రాజ్యసభలో 56 మంది పదవీకాలం పూర్తి కానుంది. తెలంగాణ లో 3, ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అత్యధి కంగా యూపీలో 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఈనెల 15 వరకు రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. ఫిబ్రవరి 27 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 27న సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది.

తెలంగాణలో ఏప్రిల్ నాటికి వద్దిరాజు రవిచంద్ర, లింగ య్య, సంతోష్ పదవీ కాలం పూర్తి కానుంది. ఏప్రిల్ నాటికి ఏపీ నుంచి సీఎం రమేష్, కనకమేడల, వేమిరెడ్డి పదవీకాలం పూర్తి కానుంది….