TRINETHRAM NEWS

అతిపెద్ద ధ్యానమందిరాన్ని ప్రారంభించిన మోదీ

ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యానకేంద్రం స్వర్వేద్ మహామందిరాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. యూపీలోని వారణాసిలో దీనిని నిర్మించారు. ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ కలిసి ఈ కేంద్రాన్ని ప్రధాని పరిశీలించారు. ఇక్కడ గడిపే ప్రతి క్షణం అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని మోదీ అన్నారు. అభివృద్ధి విషయంలో కాశీ ప్రజలు రికార్డులు సృష్టించారని.. అందుకు ఈ మందిరం నిదర్శమని పేర్కొన్నారు.