TRINETHRAM NEWS

యాదాద్రి శ్రీలక్ష్మినర్సింహా స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు…

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ఈరోజు యాదాద్రి శ్రీ లక్ష్మినర్సింహా స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న వారిలో మేడ్చల్ జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్, బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, నాయకులు పోలీస్ గోవింద్ రెడ్డి, సాయి, తదితరులు పాల్గొన్నారు.