త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి మండలాలలో పనుల ముమ్మరం చేసి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ముందుగా పెద్ది రెడ్డిగూడెం, భీమునిగూడెం , జానకిపురం, రంగాపురం, అన్నపురెడ్డిపల్లి, తొట్టి పంపు, అనంతరం ములకలపల్లి మండలంలో రామచంద్రాపురం,చాపరాలపల్లి,గుట్ట గూడెం, మాదారం, ములకలపల్లి,జగన్నాధపురం, పాతగంగారం పంచాయతీలలో పర్యటించి సిసిరోడ్లు క్యాటిల్ షెడ్లు మ్యాజిక్ షాక్ ఫిట్లు మునగ ప్లాంటేషన్లు, కల్వర్టులు బోరు మోటర్లు తదితర పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. అన్నపరెడ్డిపల్లి మండల కేంద్రంలోని అన్నపురెడ్డిపల్లి అశ్వారావుపేట దమ్మపేట మూడు మండలాల, ఉపాధ్యాయులు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రెండు మండలాల అధికారులు మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


