TRINETHRAM NEWS

Membership registration program for Gadapagadapa under the leadership of senior BJP leader Maccha Vishwas

28వ డివిజన్ 102వ బూత్ లో బీజేపీ సినియర్ నాయకుడు మచ్చ విశ్వస్ ఆధ్వర్యంలో గడపగడపకు సభ్యత్వ నమోదు కార్యక్రమం

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

సూర్య నగర్ లో 102వ బూత్ లో బీజేపీ సినియర్ నాయకుడు మచ్చ విశ్వస్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం( సదస్య పర్వ్ )లో భాగంగా రామగుండం నియోజకవర్గం 28వ డివిజన్ లో ఇంటింటికి తిరుగుతూ బీజేపీ సభ్యులుగా చేర్పించడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి మరియు రామగుండం నియోజకవర్గం ఇంచార్జి శ్రీమతి కందుల సంధ్యారాణి హాజరై సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సునీల్ రెడ్డి మాట్లాడుతూ నరేంద్రమోడీ నేత్రుత్వంలో దేశం ప్రపంచంలో అన్నిరంగాల్లో దూసుకుపోతుందని రామగుండం నియోజకవర్గం లో rfclతో పాటుగా తెలంగాణ పవర్ ప్లాంట్ స్థాపించి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత నరేంద్రమోడీ ది అని అన్నారు. ప్రపంచంలోనే బీజేపీ అత్యధిక సభ్యులు చేరిన పార్టీగా ఆవిర్భావించిందని బీజేపీ లో సభ్యులుగా చేరి నరేంద్ర మోడీ నాయకత్వం బలపర్చాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలోక్యాతం వెంకటరమణ, కోమళ్ళ మహేష్, భూమయ్య,కోడూరి రమేష్,ఐతే పవన్,సాగర్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App