TRINETHRAM NEWS

Kavita will attend the hearing through video conference

Trinethram News : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణకు ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకానున్నారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌పై ట్రయల్లో భాగంగా నేడు విచారణ జరుగనుంది. ప్రస్తుతం వసంత్ విహార్‌లోని పార్టీ కార్యాలయంలో కవిత బసచేశారు. తనను కలవడానికి వచ్చే పార్టీ నేతలను కలిసి మధ్యాహ్నం హైదరాబాద్‌కు కవిత బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 2:45 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ పయనంకానున్నారు. సాయంత్రం 4:45 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో లాండ్ అవుతారు. ఈ సందర్భంగా కవితకు ఘనంగా స్వాగతం పలికేందుకు భారత జాగృతి ఏర్పాట్లు చేసింది. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా తన నివాసానికి కవిత చేరుకోనున్నారు.

కాగా.. గత ఐదు నెలలకుపైగా తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితకు ఎట్టకేలకు బెయిల్ మంజూరు అయ్యింది. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి నమోదైన మనీలాండరింగ్‌, అవినీతి కేసుల్లో ఆమెకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది. విచారణ సందర్భంగా.. కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీల తీరును అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. నిందితుల్లో ఇష్టానుసారంగా కొందరిని ఎంపిక చేసుకొని అప్రూవర్లుగా మార్చుకోవటం ఏమిటని ప్రశ్నించింది. అలాగే, మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని సెక్షన్‌ 45(1) కింద మహిళలకు బెయిల్‌ మంజూరు చేసే నిబంధనను.. కవిత రాజకీయ నాయకురాలు అయినందున వర్తింపజేయలేమన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఏ స్థానంలో ఉన్నా మహిళ.. మహిళేనని పేర్కొంది. ఈ మేరకు, బెయిల్‌ ఇవ్వటానికి నిరాకరిస్తూ హైకోర్టు జూలై 1వ తేదీన ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్లను ఆమోదిస్తూ బెయిల్‌ మంజూరు చేసింది.

రెండు కేసుల్లోనూ రూ.10 లక్షల చొప్పున పూచీకత్తులు సమర్పించాలని, పాస్‌పోర్టును విచారణ కోర్టు న్యాయమూర్తి వద్ద డిపాజిట్‌ చేయాలని, సాక్షులను ప్రభావితం చేయడం కానీ బెదిరించడం కానీ చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టు విచారణలకు క్రమం తప్పకుండా హాజరుకావాలని పేర్కొంది. సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన నేపథ్యంలో, స్థానిక ఢిల్లీ కోర్టు జైలు నుంచి కవిత విడుదలకు అనుమతిస్తూ రిలీజ్‌ వారెంట్లను జారీ చేసింది. దీంతో తిహాడ్‌ జైలు నుంచి కవిత విడుదలయ్యారు..

హైదరాబాద్: ఢిల్లీ మద్యం కేసులో ఎంతో ఉత్కంఠ నడుమ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మంగళవారం బైయిల్‌పై విడుదలయ్యారు. దీంతో 164రోజుల ఉత్కంఠకు తెరపడినట్లు అయ్యింది. నిన్న తీహార్ జైలు నుంచి విడుదలైన కవిత ఇవాళ మధ్యాహ్నం 2:45గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరనున్నారు. సాయంత్రం 4:45గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఆమె తన నివాసానికి చేరుకోనున్నారు. అయితే తమ అభిమాన నేత దాదాపు ఐదు నెలల తర్వాత తెలంగాణకు వస్తుండడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆమెకు ఘనస్వాగతం పలికేందుకు భారత జాగృతి భారీ ఏర్పాట్లు చేస్తోంది.

ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితను ఈ ఏడాది మార్చి 15న ఈడీ అరెస్టు చేయగా, ఏప్రిల్ 15న సీబీఐ అరెస్టు చేసింది. అప్పట్నుంచి ఆమె తీహార్ జైలులోనే ఉంటున్నారు. అయితే ఎమ్మెల్సే కవితకు బెయిల్ తెచ్చేందుకు బీఆర్ఎస్ అధిష్ఠానం ఐదు నెలలుగా చేయని ప్రయత్నాలు లేవు. చివరికి విషయం సుప్రీంకోర్టుకు చేరగా.. విచారణ చేసిన ధర్మాసనం ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ బెయిల్ ఇచ్చింది. కవిత భర్త అనిల్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర.. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో పూచీకత్తు సమర్పించారు. దీంతో ఆమె విడుదలను అంగీకరిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీహార్ జైలుకు వారెంట్ ఇచ్చింది. దీంతో 164రోజులుగా జైలులో ఉన్న కవిత నిన్న రాత్రి బయటకు వచ్చారు.

మంగళవారం రాత్రి 9గంటలకు జైలు నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్సీ కవిత భావోద్వేగానికి లోనయ్యారు. ఐదు నెలలు తర్వాత బయటకు రావడంతో భర్త అనిల్ కుమార్, సోదరుడు కేటీఆర్, కుమారుడిని చూసి కన్నీరు పెట్టుకున్నారు. ఆమె విడుదల సందర్భంగా జైలు వద్దకు మాజీ మంత్రి హరీశ్ రావు, బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను కేసీఆర్ బిడ్డనని, తప్పు చేసే ప్రసక్తే లేదన్నారు. ప్రజల కోసం మరింతగా పోరాడతానని చెప్పుకొచ్చారు. అనంతరం ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి నేతలతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కవిత కృతజ్ఞతలు తెలిపారు. నిన్న రాత్రి కార్యాలయంలో బస చేసిన వారంతా ఇవాళ హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. అయితే సీబీఐ కేసు విషయంలో రౌస్ అవెన్యూ కోర్టులో ఇవాళ జరిగే విచారణకు కవిత వర్చువల్‌గా హాజరు అవుతారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App