WhatsApp Image 2024 12 01 at 5.47.45 PM
Trinethram News : అన్నమయ్య జిల్లా కురబలకోట
అంగళ్ళు వద్ద కనిగిరి బస్సు బోల్తా: పలువురికి గాయాలు
అంగళ్లు ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద కనిగిరి బస్సు బోల్తా పడి ప్రయాణికులు పలువురు గాయపడ్డట్లు ముదివేడు పోలీసులు తెలిపారు. కనిగిరి నుంచి బెంగళూరుకు వెళుతున్న ఆర్టీసీ బస్సు, తంబళ్లపల్లి నియోజకవర్గం లోని కురబలకోట మండలం, అంగళ్లు ఫ్లైఓవర్ బ్రిడ్జి దాటగానే ముందు వెళుతున్న కారును తప్పించ పోయి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు స్వల్పంగ గాయపడగా వారిలో ఒక మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
