
తేదీ : 22/02/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అనకా పల్లిలో విషాదం చోటుచేసుకుంది. చిన్న విషయానికే భర్తతో గొడవపడి భార్య ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వివరాల్లోకెళితే జ్యోతి అనే ఆమె తన భర్త అబ్దుల్ గని ని బయటకు తీసుకెళ్ళమని అడగగా, భర్త పట్టించుకోకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలై, జ్యోతి తల్లి ఆమెను మందలించడంతో , మనస్థాపానికి గురై భవనం పైనుంచి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
