TRINETHRAM NEWS

అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని అగ్రగామిగా నిలుపుతాం

  • హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

హైద్రాబాద్ : అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ డాక్టర్. ఎస్ ఏ సంపత్ కుమార్, మరియు జోగులాంబ ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ హైదరాబాదులోని సీఎం నివాస గృహంలో రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి జోగులాంబ అమ్మవారి జ్ఞాపిక మరియు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు .

జోగులాంబ అమ్మవారి ఆలయానికి సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చే భక్త యాత్రికుల సౌకర్యార్థం చేపట్టాల్సిన వివిధ పనులను సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ డా. సంపత్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు .

అతి త్వరలోనే అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకుంటామని, దేవాదాయ శాఖ మరియు పర్యాటక శాఖ ,పురాతత్వ శాఖ మరియు ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహిస్తానని హామీ ఇచ్చారు