TRINETHRAM NEWS

జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారిని దర్శించుకున్న:-

◆ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి

◆ఎమ్మెల్యే విజయుడు

అలంపూర్ పట్టణ కేంద్రంలోని శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి,ఎమ్మెల్యే విజయుడు దర్శించుకున్నారు.ఆలయ చైర్మన్ చిన్న కృష్ణయ్య నాయుడు అర్చకులు వారిని ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.ఆలయ చైర్మన్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేను శేష వస్త్రాలతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. అనంతరం బూడిదిపాడు దగ్గర నూతనంగా నిర్మిస్తున్న నంది విగ్రహానికి కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేశారు.