TRINETHRAM NEWS

జనసేన పార్టీ ఇంచార్జ్ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ గారు ఒంటరి మహిళల అక్క చెల్లెమ్మలకు క్రిస్మస్ కానుక..!!

పిఠాపురం జనసేన పార్టీ నాయకులు పీ.ఎస్.ఎన్.మూర్తి టీం ఈరోజు పిఠాపురం టౌన్ 10వ వార్డు మిరపకాయల వీధిలో 25 మంది ఒంటరి మహిళల అక్క చెల్లెమ్మలకు క్రిస్మస్ కానుకగా బియ్యం కూరగాయలు కిరాణా ఇవ్వడం జరిగింది అక్క చెల్లెమ్మలు అందరు కూడా ఇప్పటివరకు ఏ నాయకుడు కూడా మమ్మల్ని పట్టించుకునే దాఖలాలు లేవు జనసేన పార్టీ వాళ్లు వచ్చి మాకు ఇంత ప్రేమ చూపించి మమ్మల్ని ఆదుకున్నందుకు ఆనందంగా ఉందని మా హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలియజేశారు. చుట్టుపక్కల ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఈసారి తప్పకుండా జనసేన పార్టీ అధికారంలో వచ్చే దిశగా మేము కూడా పనిచేస్తామని వాపోయారు
పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడిని ఈసారి తప్పకుండా చూడాలని ఆశగా ఉందని ప్రజలు తెలియజేశారు.