TRINETHRAM NEWS

మయన్మార్‌లో నెలకొన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య రాకపోకలు నిలిపివేయాలని భారత్ నిర్ణయించింది.

ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేశారు.

“దేశ భద్రత తదితర కారణాల దృష్ట్యా భారత్-మయన్మార్ మధ్య ‘స్వేచ్ఛాయుత రాకపోకల విధానం(FMR)’ రద్దు చేయాలని నిర్ణయించాం.

భారత్‌లోకి అక్రమ చొరబాట్లను నిలిపివేసేందుకు ఇరుదేశాల మధ్య యథేచ్ఛగా సాగుతున్న రాకపోకలు నిలిపివేస్తున్నాం” అని స్పష్టం చేశారు.