TRINETHRAM NEWS

తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ

తిరుపతి:డిసెంబర్ 23
తిరుపతిలో ఆఫ్‌లైన్ టికెట్ల జారీ ముందుగానే ప్రారంభమైంది. వాస్తవానికి శుక్రవారం మధ్యాహ్నం నుంచి టికెట్లను జారీ చేయాలని భావించారు. కానీ గురువారం మధ్యాహ్నం నుంచే జనాలు తిరుపతిలోని కౌంటర్ల దగ్గరకు వచ్చారు. దీంతో ముందుగానే టికెట్లను జారీ చేస్తున్నారు.

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వారం గుండా స్వామివారి దర్శనానికి భక్తుల్ని అనుమతిస్తారు.

అయితే ముందుగానే అలిపిరి వద్ద వైకుంఠ ఏకాదశి రద్దీ మొదలైంది. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోసం భక్తులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. 9 కేంద్రాల ద్వారా టీటీడీ టోకెన్లు జారీ చేస్తున్నారు.

మొత్తం 4,23,500 వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు పూర్తి అయ్యేవరకు నిరంతరా యంగా జారీ చేయనుంది టీటీడీ. శనివారం వేకువ జామున 1.45 గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రారంభిం చేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.

కాగా, రేపు 24న ద్వాదశి. వైకుంఠ ఏకాదశి నాడు స్వర్ణ రథం, ద్వాదశి నాడు శ్రీవారి పుష్కరిణి లో చక్రస్నానం నిర్వహిస్తారు. రేపటి నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. జనవరి 1వ తేదీతో వైకుంఠ ద్వార దర్శనం ముగుస్తుంది.

తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీ‌నివాసం, గోవింద‌ రాజ‌స్వామి స‌త్రాలు, భూదేవి కాంప్లెక్స్‌, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, జీవ‌కోన హైస్కూల్‌, బైరాగి ప‌ట్టెడ‌ లోని రామానాయుడు హైస్కూల్‌, ఎంఆర్ ప‌ల్లిలోని జెడ్పీ హైస్కూల్‌‌లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఈ టికెట్ల ను జారీ చేస్తారు.

టోకెన్ల కేటాయింపు కేంద్రాల వద్ద ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రతతో పాటు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసింది టీటీడీ. వైరస్ వ్యాప్తి కారణంగా మాస్క్ ధరించాలని టీటీడీ ఇప్పటికే భక్తులకు సూచిస్తోంది. భక్తులకు ఆహారం, నీటి సౌకర్యంతో ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసింది