TRINETHRAM NEWS

తెలంగాణ : సైబరాబాద్ :

భార్య ఫిర్యాదుతో భర్తకు చిత్రహింసలు.. ఇన్స్పెక్టర్ పై సస్పెన్షన్ వేటు

సైబరాబాద్ పరిధిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లపై సస్పెన్షన్ వేటు

ఓ దంపతుల కేసు వ్యవహారంలో భర్తను స్టేషన్ కు పిలిపించి కొట్టారని కేపీహెచ్బీ ఇన్స్పెక్టర్ వెంకట్ సస్పెండు.

ఇటీవల కేపీహెచ్బీ పోలీసులు తనను పోలీసు స్టేషన్లో చిత్రహింసలు పెట్టారంటూ ఓ బ్యాంకు మేనేజర్ ప్రణీత్ ఆరోపించారు.

తన భార్య ఇచ్చిన ఫిర్యాదుతో అరికాళ్లు, చేతులపై లాఠీలతో బాదారని చెప్పారు.

ఉదయం నుంచి రాత్రి వరకూ తనను కొట్టారని.. అసభ్యంగా దూషించారని దాం ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఈ ఘటనపై స్పందించిన సీపీ అవినాష్ మహంతి.. ఇన్స్పెక్టర్ వెంకట్ ను సస్పెండ్ చేశారు.

అలాగే ఓ కేసు విషయంలో నిర్లక్ష్యం వహించిన కారణంగా ఎయిర్ పోర్ట్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆర్.శ్రీనివాస్ పై వేటు ఉన్నతాధికారులు.