TRINETHRAM NEWS

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. పటాన్ చెరు సమీపంలో ఓఆర్ఆర్ పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. సీనియర్ నేత, ఎమ్మెల్యే సాయన్న మరణంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన కూతరు లాస్య నందితకు బీఆర్ఎస్ కంటోన్మెంట్ సీటు ఇచ్చారు. గతేడాది ఫిబ్రవరి 19న సాయన్న మృతి చెందారు. ఏడాదిలోనే తండ్రి, కూతురు మరణించారు.