TRINETHRAM NEWS

Trinethram News : ఆంధ్ర ప్రదేశ్ లో కుల గణన ప్రక్రియను ఫిబ్రవరి 4వ తేదీ వరకు పెంచినట్లు వెల్లడించారు.

కుల గణన సేకరణను ఈ నెల 19 నుంచి ప్రారంభించి 29వ తేదీ లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేసినప్పటికీ యాప్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అందరి వివరాలు నమోదు చేయలేకపోయారు. వీరి అందరి కోసం పూర్తిగా నమోదు చేసుకోవడానికి ఫిబ్రవరి 4 వరకు పొడిగించారు.

ఆఖరి గడువు ఫిబ్రవరి 4 తర్వాత కూడా నమోదు చేయక పోతే ఫిబ్రవరి 7వ తేదీ లోపల నేరుగా గ్రామ/వార్డ్ సచివాలయాలకు వెళ్లి నమోదు చేసుకోవచ్చు.