
- సిమర్ల శ్రీను యాదవ్
- బిఆర్ఎస్ యువజన నాయకులు
Door-to-Door Voter Registration : చింత పల్లి జులై 17,త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలంలోని తీదేడు గ్రామంలో ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న SIR ( స్పెషల్ ఇంటన్సివ్ రివిజన్ ) కార్యక్రమంలో భాగంగా బూత్ లెవల్ అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాల నమోదు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు సిమర్ల శ్రీను యాదవ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఎస్ ఐ ఆర్ నమోదు ప్రాముఖ్యతను వివరించి,అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను సకాలంలో నమోదు చేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, గ్రామ ప్రజలు ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా (SIR) ,ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో పాల్గొని తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు. ఎన్నికల అధికారులకు అవసరమైన సహకారం అందించాలని గ్రామస్తులను విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో తీదేడు గ్రామ పాలన అధికారి బుషిపాక యాదయ్య,బి.ఎల్.ఓ అంజమ్మ, చింతకుంట్ల రాకేష్ తదితరులున్నారు.