TRINETHRAM NEWS

సీఎం రేవంత్ తొలి జిల్లా టూర్ ఖరారు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తొలి జిల్లా టూర్ ఖరారు అయింది. MCRHRDలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఓడిన అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తనకు ఆదిలాబాద్ జిల్లాపై ప్రత్యేక అభిమానం ఉందని వారితో చెప్పినట్టు మంత్రి సీతక్క తెలిపారు. అందుకే తన తొలి జిల్లా పర్యటనలో భాగంగా జనవరి 26 తర్వాత ఇంద్రవెల్లికి వస్తానని మాట ఇచ్చినట్టు వెల్లడించారు