TRINETHRAM NEWS

నారా లోకేష్‌కు సీఐడీ నోటీసులు.. ఎందుకంటే..?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. రెడ్ బుక్ అంశంపై ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. రెడ్‌బుక్‌ పేరుతో నారా లోకేష్ బెదిరిస్తున్నారని అధికారులు CID కోర్టును ఆశ్రయించారు..

దీంతో నారా లోకేష్‌కు నోటీసులు ఇవ్వాలని CID న్యాయమూర్తి సూచించారు. ఈ నేపథ్యంలోనే సీఐడీ అధికారులు వాట్సాప్‌లో నోటీసులు పంపారు. కాగా ఈ కేసులో తదుపరి విచారణను జనవరి 9వ తేదీకి సీఐడీ కోర్టు వాయిదా వేసింది..