TRINETHRAM NEWS

Trinethram News : AP: తాము అధికారంలోకి వస్తే 50 ఏళ్లకే బీసీలకు
రూ.4 వేల పెన్షన్ ఇస్తామని టీడీపీ చీఫ్ చంద్రబాబు
అన్నారు. ‘బీసీలకు పెళ్లికానుక రూ. లక్షకు పెంచుతాం.
చంద్రన్న బీమా పరిహారాన్ని రూ.10 లక్షలు అందిస్తాం.
బీసీలకు పర్మినెంట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇస్తాం. రూ.1.50
లక్షల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తాం.
చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తాం’
అని ఆయన హామీ ఇచ్చారు.