
Trinethram News : న్యూ ఢిల్లీ:మార్చి 09
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమీపిస్తున్నాయి. ఎలాగైనా అధికారం నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గద్దె దించాలని గట్టిగానే విశ్వ ప్రయత్నాలు జరుగు తున్నాయి.
ఈ నేపథ్యంలో శనివారం ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్షాతో టిడిపి అధి నేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయు డు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు.
అమిత్ షా ఉదయం 11 గంటలకు పాట్నా వెళ్లను న్నారు. టీడీపీ-జనసే న-బీజేపీ పొత్తుల ఖరారుపై సర్వత్ర ఉత్కంఠ కొనసాగు తుంది.10 లోక్సభ స్థానాలకు బీజేపీ ప్రతిపాదనలు చేస్తోంది.
కనీసం 8 లోక్సభ సీట్ల కోసం పట్టు పట్టినట్లు తెలుస్తోంది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి రావాలని భారతీయ జనతాపార్టీ వ్యూహాలు రచిస్తోంది…
