BRS : నేడు మేడిగడ్డకు బిఆర్ఎస్ నేతలు

TRINETHRAM NEWS

BRS leaders to Madigadda today

Trinethram News : హైదరాబాద్: జులై 26
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన రెండో రోజు కొనసాగుతోంది. గురువారం రోజు అసెంబ్లీ సమావేశాల తర్వాత మేడిగడ్డకు బయల్దేరిన బీఆర్ఎస్ బృందం సాయంత్రానికి అక్కడికి చేరుకుంది.

మొదట కరీంనగర్ లోని లోయర్ మానేరు రిజర్వా యర్ ను ఈ టీమ్ పరిశీ లించింది. అనంతరం రామగుండంలో విశ్రాంతి తీసుకుంది.

ఇవాళ ఉదయం రామ గుండం ఎన్టీపీసీ నుంచి కన్నెపల్లికి బయల్దేరి వెళ్లిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. మంచిర్యాల జిల్లా ఇందారం వద్ద నీటి ప్రవాహం లేక ఎండిపోయిన గోదావరి నదిని పరిశీలించారు.

మరికాసేపట్లో కన్నెపల్లి పంపు హౌజ్‌కు చేరుకో నున్నారు. పంప్‌ హౌస్‌ను పరిశీలించిన అనంతరం మీడియాతో కేటీఆర్‌ మాట్లాడుతారు.

అనంతరం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి.. అక్కడ గోదావరి నది ఉద్ధృతిని పరిశీలిస్తారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BRS leaders to Madigadda today

You cannot copy content of this page

Scroll to Top