WhatsApp Image 2023 12 26 at 11.42.26 AM
గుండెపోటుతో బాలుడి మృతి
పదమూడేళ్ల బాలుడు గుండెపోటుతో మృతిచెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్లో జరిగింది.
తాళ్లపల్లి సుశాంత్ ముస్తాబాద్ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. క్రిస్మస్ సెలవులకు ఇంటికి వచ్చిన అతడు నిన్న ఛాతిలో నొప్పి రావడంతో అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలించగా, అప్పటికే గుండెపోటుతో చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు..
