TRINETHRAM NEWS

అంగన్వాడి వర్కర్స్ యూనియన్ కు చర్చలకు పిలిచిన ప్రభుత్వం

గత 15 రోజులుగా అంగన్వాడి వర్కర్స్ విధులను బహిష్కరించి సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఒకసారి చర్చలకు వెళ్ళినా ఆ చర్చలు విఫలం అవ్వటంతో సమ్మెను కొనసాగించారు.

ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మళ్ళీ చర్చలకు రమ్మని అంగన్వాడి వర్కర్స్ యూనియన్ కు ఆహ్వానం పంపడం జరిగినది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మంత్రివర్గ సబ్ కమిటీ తో భేటీ వుంటుందని ఆ భేటీలో ఆర్ధిక పరమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.