TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్రప్రదేశ్ గా మారింది: లోకేశ్

AP: సీఎం జగన్ పాదయాత్ర సమయంలో ఇష్టమొచ్చినట్లు హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక అందర్నీ మోసం చేశారని TDP జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉద్యమాంధ్రప్రదేశ్ గా మారిందని అన్నారు. అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు నిరసన చేస్తున్నారు. డిమాండ్ల పరిష్కారం కోసం రోడ్లెక్కి నిరసన తెలపాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.