TRINETHRAM NEWS

శ్రీశైలంలో 23 నుంచి అభిషేకాలు నిలుపుదల

శ్రీశైలంలో ఈనెల 23, 24, 25 తేదీల్లో గర్భాలయ, సామూహిక అభిషేకాలు నిలిపివేయనున్నట్లు ఈవో డి.పెద్దిరాజు తెలిపారు.

అభిషేకాలకు ప్రత్యామ్నాయంగా రోజుకు నాలుగు విడతల్లో మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనానికి అవకాశం కల్పిస్తామన్నారు.

స్పర్శ దర్శనం టికెట్లను దేవస్థానం వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని తెలిపారు.

ముక్కోటి ఏకాదశి పర్వదినం, సెలవులు కావడంతో భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.