TRINETHRAM NEWS

Trinethram News : గుంటూరు జిల్లా ఫిబ్రవరి 13: ప్రేమికుల దినోత్స‌వం వేళ మృత్యతాండ‌వం చేసింది గుంటూరు జిల్లాలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఇప్పుడు యావ‌త్ ఏపీ తెలంగాణ‌లో సంచ‌ల‌నంగా మారింది ప్రైవేటు వ‌ర్సిటీలో చ‌దువుతున్న స్టూడెంట్స్ ఇద్ద‌రూ ఒకే అమ్మాయిని ప్రేమించారు.

ఈ ట్రాయాంగిల్ ల‌వ్ స్టోరీ ఆఖ‌రికి విషాదాన్ని మిగిల్చింది ఈ క్ర‌మంలో ఆ అమ్మాయితో క‌లిసి ఔటింగ్‌కు వెళ్లి అటో ఇటో తేల్చుకోవాల‌నుకున్నారు. ఈ గొడ‌వ‌కు పుల్ స్టాఫ్ పెట్టాల‌ని ఆ యువ‌తి వారిని రిజెక్ట్ చేసింది.

దీంతో కోపం త‌ట్టుకోలేని యువ‌కులు ఆ అమ్మాయిని చంపేసి ముక్క‌లు క‌ట్‌చేసి సూట్‌కేసులో పార్స‌ల్ చేశారు ఇక‌ అక్క‌డే ఇద్ద‌రు కొట్టుకున్నారు ఈ దాడిలో ఓ యువ‌కుడు చ‌ని పోయాడు.

ఇక‌ మ‌రో యువ‌కుడు హాస్ట‌ల్‌కి వెళ్లి దీనికంత‌టికి యూనివ‌ర్సీటీ డీన్ కార‌ణ‌మంటూ లెట‌ర్ రాసి తానూ సూసైడ్ చేసుకున్నాడు దీంతో మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెల‌కొంది పోలీసుల విచార‌ణ‌లో ఒక్కో విష‌యం బ‌య‌ట‌ ప‌డుతోంది.

గుంటూరు జిల్లా వడ్డేశ్వరం గ్రామంలోని కేఎల్ యూని వర్సిటీ క్యాంపస్‌లో వంశీ సాయికృష్ణ (20) అనే ఇంజినీరింగ్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో చ‌నిపోయాడు తాడేపల్లి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ కేసు విచారిస్తుండ‌గా మ‌రిన్ని విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి శనివారం క్యాంపస్‌లో మృతదేహం లభ్యమైంది. మాచర్లకు చెందిన సాయికృష్ణ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నట్లు యూనివర్సిటీ సిబ్బంది తెలిపారు.

బాధితుడు చనిపోయే ముందు అర్ధ‌రాత్రి వరకు హాస్టల్‌లో స్నేహితులతో గడిపినట్లు విద్యార్థులు తెలిపారు.ద‌ర్యాప్తులో విస్తుపోయే విష‌యాలు.

పోలీసుల ద‌ర్యాప్తులో ఇది ట్రయాంగిల్ ల‌వ్ స్టోరీ అని తేలింది. దీని కార‌ణంగా ముగ్గురు చ‌ని పోయార‌ని వెల్ల‌డ‌య్యింది కేఎల్ యూనివ‌ర్సిటీకి చెందిన ఒక అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు గొడవ పడినట్టు తెలిసింది. యూనివర్సిటీ హాస్టల్ అబ్బాయి, బయటి కాలేజీ అబ్బాయి ఇద్దరూ ఒకే అమ్మాయిని ల‌వ్ చేయ‌డ‌మే దీనికి కార‌ణంగా తెలుస్తోంది.