TRINETHRAM NEWS

అనంతపురం జిల్లాలో ట్రాక్టర్ ను ఢీ కొట్టిన వోల్వో బస్సు

అనంతపురం జిల్లా: డిసెంబర్23

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గార్లదిన్నే మండలం కల్లూరు దగ్గర బస్సు, ట్రాక్టర్‌ ఢీకొట్టడంతో ఘటన జరిగింది.

శనివారం తెల్లవారు జామున బియ్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ప్రైవేట్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్‌లో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు.

ఈ ప్రమాదంలో మృతులను గుత్తి మండలం మామిడూరుకు చెందిన రైతులు..

చిన్నతిప్పయ్య(45), శ్రీరాములు(45), నాగార్జున(30), శ్రీనివాసులు(30)గా గుర్తించారు.

ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌ సహా మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి. గాయపడ్డ నరేష్ అనే వ్యక్తి‌ పరిస్థితి విషమంగా ఉంది.

వెంటనే అతడిని అనంతపురం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది