TRINETHRAM NEWS

ఏపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో ఏఐ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అవగాహన పెంచేందుకు ఇంటెల్ ఇండియా సహకారంతో ఏఐ ల్యాబ్స్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.

విజయనగరం జిల్లా చీపురుపల్లి లోని ఉన్నత పాఠశాలలో తొలి ల్యాబ్ ను అందుబాటులోకి తెచ్చింది.

ఏఐ ఫర్ యూత్ పేరుతో నాలుగు సెషన్లలో 8,9 తరగతుల విద్యార్థులకు శిక్షణ ఇస్తారు.

అనంతరం దీనిపై విద్యార్థుల చేత ప్రాజెక్టులు తయారు చేయిస్తారు