TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్‌ : నగరంలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. మూడు రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సోమవారం రాజేంద్రనగర్‌(Rajendranagar)లో అత్యల్పంగా 13.5 డిగ్రీలు, పటాన్‌చెరు(Patancheru) – 14.2, దుండిగల్‌ – 16.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఉదయం పొగమంచు రహదారులను కప్పేయడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఉపరితల గాలులు ఆగ్నేయ దిశలో గంటకు 6-8 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. మరో రెండు రోజులు ఇదే తరహాలో వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు.