MLA MS Raj Thakur : ఏ టి సి షార్ట్ టర్మ్ కోర్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎం ఎస్ రాజ్ ఠాకూర్

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ రామగుండం ప్రతినిధి..రామగుండం ఏటీసీ గవర్నమెంట్ ఐటీఐలో నిర్వహించిన షార్ట్ టర్మ్ కోర్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు వారితో పాటు మేయర్ మహంకాళి స్వామి పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
యువతకు నైపుణ్యాభివృద్ధి ఎంతో అవసరమని, ఇలాంటి షార్ట్ టర్మ్ కోర్సులు విద్యార్థులకు ఉపాధి అవకాశాలను విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని తమ భవిష్యత్తును స్వయంగా నిర్మించుకోవాలని ఆకాంక్షించారు.
అలాగే విద్య ద్వారా మాత్రమే యువత తమ లక్ష్యాలను సాధించగలరని, సమాజ అభివృద్ధికి కూడా వారు తోడ్పడగలరని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు ఐటీఐ అధికారులు, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA MS Raj Thakur participated in the inauguration ceremony

You cannot copy content of this page

Scroll to Top