వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తరఫున వికారాబాద్ అసెంబ్లీ ఎస్సీ మోర్చా ఎన్నికల ఇంచార్జిగా శ్రీ ఎర్రోళ్ల లక్ష్మయ్య ను భారతీయ జనతా పార్టీ నియమించడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వం మరియు ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ క్రాంతి కిరణ్ సంయుక్తంగా ఈ నియామక ఉత్తర్వులను జారీ చేశారు.
శ్రీ ఎర్రోళ్ల లక్ష్మయ్య నియామకం పట్ల జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయి కార్యకర్తలు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారి సమర్థవంతమైన నాయకత్వంలో వికారాబాద్ అసెంబ్లీ లో ఎస్సీ మోర్చా మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొత్త బాధ్యతలు స్వీకరించిన శ్రీ ఎర్రోళ్ల లక్ష్మయ్య కి హృదయపూర్వక శుభాకాంక్షలు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


