త్రినేత్రం న్యూస్: జనవరి 3: నెల్లూరు జిల్లా :కావలి : అల్లూరు మండలం: అల్లూరు పేటలో కె.ఎస్.ఆర్ ఫౌండేషన్ అధినేత కందుల రాజారెడ్డి తల్లిగారు కందల సుజాతమ్మ పెద్దకర్మ కార్యక్రమం శనివారం వారి నివాసంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి , పాల్గొని సుజాతమ్మ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
అనంతరం కందుల రాజారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి,ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి , మాట్లాడుతూ, సుజాతమ్మ సౌమ్య స్వభావంతో, సేవాభావం కలిగిన మహిళగా అందరి మన్ననలు పొందారని గుర్తు చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


