Vikarabad News : చెరువు కట్టను పగుల గొట్టి ధ్వంసం చేసిన వారిఫై చర్యలు, తీసుకోవాలీ

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గ ప్రతినిధి త్రినేత్రం న్యూస్,చౌడపూర్ మండలం బుధవారం ,లింగం పల్లీ గ్రామం లో మ్యాకలోని చెరువును,రాత్రి వేళలో దొంగ చాటుగా చెరువు కట్టను పగుల గొట్టి ధ్వంసము చేసి నీళ్ళు నిలవకుండా చేస్తున్నారు.గత సంవత్సరం క్రితం ఇట్టి విషయం జిల్లా కలెక్టర్ మరియు ఆర్డీవో ఎస్పీ కి తెలుపడం జరిగింది.అట్టి చెరువును ఆర్డీవో సందర్శించారు,కట్టను భాగుచేస్త మన్నా రూ,కొంత నిర్మించారు,మల్ల ఇప్పుడు కట్టను దంసం చేసినారు,చెరువు కింద ఆయా కట్టు దారులు భూముల వరి పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతారు,చెరువులో నీరు లేకుంటే చుట్టూ ప్రక్కల బోర్లలో సైతం నీరు పోతుంది .

దానితో నీరు లేక పంటలు ఎండిపోతాయి,ఎండాకాలం పశువులకు,జీవరాశులకు సైతం నీళ్లు లేకపోతే మల మల మాడి చనీ పోయే పరిస్థితి వస్తుంది,మత్స్య కారుల జీవితాలు దుర్బర మవుతాయినీ ఈ మేరకు చౌడపూర్ మండలం తహసీల్దార్ కి జిల్లా మత్స్య కారులు మత్స్య కార్మిక సంఘం ఆధ్యర్యం లో మత్స్య కారులు,రైతులు పిర్యాదు చేశారు. ఇట్టి కార్య క్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి పి.జంగయ్య ముదిరాజ్, రాజు, శ్రీనివాసు, హమ్మయ్య చంద్రయ్య, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Action should be taken against those who broke and destroyed

You cannot copy content of this page

Scroll to Top