Trinethram News : జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి. నవీన్ యాదవ్ ని భారీ మెజారిటీతో గెలుపించేందుకు ఈరోజు కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ తెలంగాణ రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి తో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రచారంలో పాల్గోన్నారు..
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి జరుగుతున్న ప్రజా పాలన విధానాన్ని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు అనునిత్యం తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయి అని మండిపడ్డారు..
జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై అసత్యలను అంటకట్టి గెలువాలని చూడటం వారి భ్రమ మాత్రమే అన్నారు.. చిన్న శ్రీశైలం యాదవ్ తో సహాయం కోరిన వారే ఈరోజు అసత్యాన్ని ప్రచురించడం చాలా బాధాకరం అన్నారు..
జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి.నవీన్ యాదవ్ గెలుపై నియోజకవర్గం ప్రజలు గట్టి నమ్మకంతో ఉన్నారని తెలిపారు..
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి, కొంపల్లి మాజీ సర్పంచ్ జిమ్మి దేవేందర్, మరియు స్థానిక నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


