మర్యాదపూర్వకంగా కలిసి అందజేసిన కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య, కార్యవర్గ సభ్యులు.
-కూకట్పల్లి ప్రెస్ క్లబ్ నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ.
కూకట్పల్లి, సెప్టెంబర్ 26 త్రినేత్రం న్యూస్ : కూకట్పల్లి ప్రెస్ క్లబ్ స్థలం,భవన నిర్మాణం కొరకు కూకట్పల్లి నియోజకవర్గం పిఎసి చైర్మన్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య, కార్యవర్గ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రెస్ క్లబ్ స్థలము, భవనం లేక ప్రింట్ అండ్ ఎలెక్ట్రానిక్ మీడియా విలేకరులు ప్రెస్ మీట్లు,యూనియన్ మీటింగులు,సమస్యల గురించి చర్చించుకుందామంటే సరైన షెల్టర్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు.ఇక్కడ విలేకరుల ఐక్యతా లోపమో మరి ఇంకేదైన కారణమో ఇప్పటి వరకు ఏ విలేకరి ప్రెస్ క్లబ్ కొరకు ఆలోచన చేయలేదు. అలాగే విలేకరులను సంఘటితం చేయలేక పోయారని ఆయన వివరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సానుకూలంగా స్పందిస్తూ కూకట్పల్లి ప్రెస్ క్లబ్ నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రెటరీ నాగుల అంజిబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.లక్ష్మి, సభ్యులు అనిల్ కిషోర్, బాలాపురం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


