Jul 14, 2025, ఖమ్మం రూరల్: ఇంటిపై బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ తీగ తగిలి ఓ మహిళ మృతి చెందిన ఘటన సోమవారం ఖమ్మం రూరల్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కస్నాతండాకు చెందిన ముత్తమ్మ ఇంటిపై బట్టలు ఆరేస్తుండగా పైన ఉన్న 11KV విద్యుత్ తీగ తగిలి షాక్ తో అక్కడికక్కడే మృతి చెందింది. ముత్తమ్మ మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


