దేవరకొండ పట్టణ కేంద్రంలో విద్యుత్ కి అంతరాయం

TRINETHRAM NEWS

దేవరకొండ జూలై 03 త్రినేత్రం న్యూస్. గురువారం రోజు న దేవరకొండ పట్టణ కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో విద్యుత్ కి అంతరాయం ఏర్పడింది .

ఈరోజు మొత్తం మీద మధ్యాహ్నం ఒక గంట మాత్రమే విద్యుత్ వొచ్చిందని వివిధ గ్రామాల నుoచి రిజిస్ట్రేషన్ ల కోసం వచ్చిన వారందరూ ఆఫీస్ చుట్టూ పడిగపులు కాయాల్సి వచ్చిందని ఇలా రోజుల తరబడి పట్టణంలో కరెంటు పోయి అంతరాయం కలగడం పై చాల ఇబ్బంది కరంగా మారిందని ఆందోళన చెందుతున్నారు. రోజు మొత్తం కరెంటుకు అంతరాయం కలిగిన అధికారులు కూడా స్పందించకపోవడం బాధాకరమన్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు విద్యుత్ అధికారులు స్పందించి విద్యుత్ అంతరాయం లేకుండా చూస్తారని ప్రజలు కోరుతున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Power outage in Devarakonda

You cannot copy content of this page

Scroll to Top