డిండి (గుండ్లపల్లి) జూలై 02త్రినేత్రం న్యూస్ . ఇటీవల స్వర్గస్తులైన రిటైర్డ్ గెజిటెడ్ హెడ్మాస్టర్ కుంభం నారయ్య గౌడ్ దశదిన కర్మ కార్యక్రమం డిండి మండల ఫరిది లోని చెరుకుపల్లిలో బుధవారం నిర్వహించారు .ఈ కార్యక్రమంలో నారయ్య గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల ను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ పెన్షనర్స్ సంఘం సభ్యులు అడపాల శేఖర్ రెడ్డి సంతాప ప్రకటన చదివి, విద్యారంగానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో అడపాల జంగారెడ్డి ,వద్ది జంగారెడ్డి, వంగాల శేఖర్ రెడ్డి, నారాయణ సింగ్ ,లక్ష్మీపతి, శ్రవణ్ కుమార్ రెడ్డి, మంద వెంకటరెడ్డి, సుస్కాండ్ల ధర్మారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తో పాటు పలువురు గ్రామస్తులు, నారయ్య గౌడ్ బంధుమిత్రులు, పూర్వ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


