పెద్దపల్లి, జూలై -01: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు ఉద్యోగుల సమయపాలన, విధుల్లో పారదర్శతకు ఫేసియల్ రికగ్మిషన్ హాజరు విధానాన్ని అమలు చేయాలని పంచాయతీ రాజ్ & గ్రామీణ ఉపాధి కల్పన సంచాలకులు జి. సృజన జారీ చేసిన ఉత్తర్వులు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అవసరమైన పరికరాలు కోనుగోలు చేసి ఆయా మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయములకు పంపించామని అన్నారు విధులకు హాజరు, ఇంటికి వెళ్ళే సమయాల్లో ఉద్యోగులు సిబ్బంది అంతా బయోమెట్రిక్ హాజరు వేయాల్సి ఉంటుందని, దీంతో ఉద్యోగులు, సిబ్బంది కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేసే అవకాశము ఉంటుందని ముఖ్య కార్య నిర్వహణాధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


