దేవరకొండ జూన్ 14 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణానికి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది వివి రామారావు అకాలమరణ వార్తకు చింతిస్తూ ఎమ్మెల్యే బాలు నాయక్ ఆయన భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబానికి పరమార్శించి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవరెడ్డి, నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, వివిధ హోదాలో ఉన్న ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


