డిండి (గుండ్ల పల్లి) జూన్ 02 . డిండి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో యాసింగి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. అధికారులతో మాట్లాడుతూ రెండు రోజుల్లో వడ్ల కొనుగోలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఆలస్యం పై ఆరా తీశారు .వడ్ల మ్యాచర్ ని పరిశీలించి రైతులకు తగిన సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు ఆర్డిఓ రమణారెడ్డి ,తాసిల్దార్ ఆంజనేయులు, జిల్లా పౌరసరఫరాల అధికారులు, దేవరకొండ సివిల్ సప్లై అధికారి శ్రీనివాస్ గౌడ్, సీఈవో బాల్ రెడ్డి, రెవిన్యూ సిబ్బంది రైతులు ,తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


