WhatsApp Image 2025 01 22 at 6.52.33 PM
దేవరకొండ నియోజకవర్గ బ్రాహ్మణ సంఘం సమావేశం.
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్ .
దేవరకొండ నియోజకవర్గ బ్రాహ్మణ సంఘం సమావేశం బుధవారం దిండి మండలంలోని గోన బోయినపల్లి గ్రామంలో గ్రామ పురోహితులు సురభి రఘుచరణ్ గారి నివాసంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సంఘం అధ్యక్షులు కురుమేటి రవి ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను అందరూ వినియోగించుకోవాలని చెప్పారు.
అదేవిధంగా రాబోయే విశ్వా వసునామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ మరియు ముద్రణపై చర్చ జరిగి నిర్ణయించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సలహాదారులు కురువేటి బిక్షపతి శర్మ పాల సదాశివశర్మ, గారపాటి భాస్కర్ గొట్టిముక్కల గణేష్ శర్మ, కన్వీనర్ కురుమేటి వంశీ, ఉపాధ్యక్షులు బహుగానం చంద్రశేఖర శర్మ, కురువేటి ఉమా శంకర్ సురాభి ప్రభాకర్ శర్మ, ఉప్పల శ్రీనివాస్ శర్మ, గాదె కిషోర్, డేరం సతీష్ శర్మ, నెమళ్ళ వెంకట్, సురభి శ్రీ చరణ్ వెంకటాచార్యులు, అజయ్ శర్మ మీడియా కార్యదర్శి గాదె గిరిధర్ గణేష్ పాండే తదితర బ్రాహ్మణులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
