TRINETHRAM NEWS

Acharya Konda Laxman Bapuji’s birth anniversary celebrations

Trinethram News : మల్కాజిగిరి 27 సెప్టెంబర్

బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి సందర్భంగా మల్కాజిగిరి నియోజకవర్గం, ఓల్డ్ సఫిల్గుడా బీసీ భవన్ లో ఘనంగా జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన త్యాగాలను స్మరించుకొని ఆయన ఆశయాలను భవిష్యత్ తరాలవారికి తెలిసే విధంగా కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పిట్టల శ్రీనివాస్, సీనియర్ నాయకులు బత్తిని నరసింహ గౌడ్ సంపత్, గోపాల్, బాలరాజు, సుధాకర్,  వంశీ నేత, నరేందర్, పిట్టల నాగరాజ్, మంద భాస్కర్, దశరధినేత వెంకటేష్ , నేత ఆంజనేయులు, సాంబరాజు, సత్యనారాయణ, అజీజ్ పాషా, తో ఆటో బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Acharya Konda Laxman Bapuji's birth anniversary celebrations