TRINETHRAM NEWS

MP Etela Rajender started the blood donation camp

Trinethram News : మల్కాజిగిరి : 23 సెప్టెంబర్

భారతీయ జనతా పార్టీ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవమహాయజ్ఞం కార్యక్రమంలో భాగంగా సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బిజేవైఎం ఆధ్వర్యంలో మల్కాజిగిరి నియోజకవర్గం వినాయకనగర్ డివిజన్ లోని ఎస్ఎస్ గార్డెన్ లో నిర్వహించిన రక్తదాన శిబిరంను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్  ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రక్తదానం చేసిన వారికి శాలువా కప్పి సత్కరించి, సర్టిఫికెట్ అందివ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్ర రావు,  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు మల్లారెడ్డి,  రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షులు మహేందర్, వినాయక నగర్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి , బీజేవైఎం  జిల్లా అధ్యక్షులు ప్రభాకర్, మల్కాజ్గిరి అసెంబ్లీ కన్వీనర్ డిఎన్ వెంకటేష్, బీజేవైఎం నాయకులు సంతోష్ గౌడ్, శ్రూకేష్, దినేష్, పవన్, రుత్విక్, సంతోష్ యాదవ్, సీనియర్ నాయకులు వీకే మహేష్ , వాసంశెట్టి శ్రీనివాస్, మాణిక్ రెడ్డి, ఓం ప్రకాష్, బాల్చందర్ గౌడ్, జ్యోతిర్మయి, జగదీష్ గౌడ్, సాయి సురేష్, గోపాల్, జగదీష్ చారి, ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App